అన్ని భాషల్లో మానాడు

అన్ని భాషల్లో మానాడు

లాస్ట్ ఇయర్ ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’తో మెప్పించిన సురేష్​ ప్రొడక్షన్స్‌‌ సంస్థ తాజాగా మరో తమిళ మూవీ రీమేక్ రైట్స్ తీసుకుంది.  టైమ్ లూప్ కాన్సెప్ట్‌‌తో శింబు హీరోగా నటించిన ‘మానాడు’  కోలీవుడ్‌‌లో సూపర్ సక్సెస్ సాధించింది.  దీంతో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌‌తో పాటు ఆల్ ఇండియన్ లాంగ్వేజ్‌‌ రీమేక్ రైట్స్‌‌ని సురేష్​ ప్రొడక్షన్స్ సంస్థ తీసుకుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్‌‌కి ఏషియన్ సినిమాస్ పార్టనర్‌‌‌‌గా ఉండనుందని  ప్రకటించింది. ఏయే భాషల్లో రీమేక్ చేయనున్నారు. ఎవరెవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది.  శింబు, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా ఎస్‌‌జే సూర్య విలన్‌‌గా నటించిన ఈ థ్రిల్లర్‌‌ను వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా సోనిలివ్‌‌లో స్ట్రీమ్ అవుతోంది.