
లాస్ట్ ఇయర్ ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’తో మెప్పించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా మరో తమిళ మూవీ రీమేక్ రైట్స్ తీసుకుంది. టైమ్ లూప్ కాన్సెప్ట్తో శింబు హీరోగా నటించిన ‘మానాడు’ కోలీవుడ్లో సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్తో పాటు ఆల్ ఇండియన్ లాంగ్వేజ్ రీమేక్ రైట్స్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తీసుకుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్కి ఏషియన్ సినిమాస్ పార్టనర్గా ఉండనుందని ప్రకటించింది. ఏయే భాషల్లో రీమేక్ చేయనున్నారు. ఎవరెవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. శింబు, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా ఎస్జే సూర్య విలన్గా నటించిన ఈ థ్రిల్లర్ను వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా సోనిలివ్లో స్ట్రీమ్ అవుతోంది.