
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది. సింగయ్య మృతి కేసులో జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఈ రోజు ( జూన్ 27) విచారణ జరిగింది. ఈ మేరకు పిటిషన్పై విచారణను మంగళవారానికి (జులై 1) వాయిదా వేసింది.. అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
ఈ కేసులో వైఎస్ జగన్తో పాటుగా నిందితులుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, విడదల రజిని, పేర్ని నాని, కేఎన్నార్లపై కూడా వచ్చే మంగళవారం వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. సింగయ్య మృతి కేసులో తమపై పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని జగన్తో పాటూ మిగిలిన వైఎస్సార్సీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
►ALSO READ | వివేకానంద రెడ్డిని చంపి సునీత మీద తోసారు.. ఇప్పుడు సింగయ్యను చంపి AI అంటున్నారు