వివేకానంద రెడ్డిని చంపి సునీత మీద తోసారు.. ఇప్పుడు సింగయ్యను చంపి AI అంటున్నారు: షర్మిల

వివేకానంద రెడ్డిని  చంపి సునీత మీద తోసారు.. ఇప్పుడు సింగయ్యను చంపి AI అంటున్నారు: షర్మిల

ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర దుమారం రేపుతున్న సింగయ్య మృతి కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. వైసీపీ అధినేతజగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు షర్మిల. వివేకానంద రెడ్డిని చంపి సునీత మీద తోశారని.. ఇప్పుడు సింగయ్యను చంపి AI అంటున్నారని అన్నారు షర్మిల.హత్యలు చేసిన వాళ్లు, చంపిన వాళ్ళు ఒప్పుకుంటారా .. ? బాబాయిని చంపి సునీత మీద నెట్టివేసిన వాళ్ళకు సింగయ్య మృతి మీద అబద్ధాలు చెప్పడం ఒక లెక్కనా అన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ అన్ని ఆధారాలు చూపించిందని.. హత్య చేసిన వాళ్లు,చేయించిన వాళ్ళతో మాట్లాడిన సంభాషణలు ఉన్నాయని చెప్పిందని.. అన్నారు షర్మిల. 

ALSO READ | తిరుమల కొండపై వేణుగోపాలస్వామి ఆలయంలో టికెట్ విధానం : ఇదేం అన్యాయం అంటున్న పీఠాధిపతి విజయశంకర్

సీబీఐ అన్ని ఆధారాలు చూపించినా కూడా మేము చంపలేదు..మాకు తెలియలేదు అని మాట మార్చినట్లు.. సింగయ్య కేసులో కూడా మాట మారుస్తున్నారని అన్నారు షర్మిల. రాష్ట్ర రాజకీయాలు దారుణంగా ఉన్నాయని.. ఉన్న పార్టీలు అన్ని మోడీ తొత్తులేనని అన్నారు. అందరు మోడీ జపం చేస్తున్నారని.. మోడీ కి యోగా మీద ఉన్న ఆంధ్రా రాష్ట్ర ప్రజల మీద లేదని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో యోగా చేస్తే తృప్తి గా ఉందంట.. యోగా చేయమని మీకెవరు చెప్పారంటూ ప్రశ్నించారు. 

మీరు యోగా చేసి తృప్తిగా ఉంటే సరిపోతుందా.. యోగా చేసి తృప్తి పడి ఒక్క హామీ అయినా ఇచ్చారా అని అన్నారు. మీరు ఇచ్చిన హామీల మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తృప్తిగా లేరని.. ప్రత్యేక హోదా అని మోసం చేశారని, ఢిల్లీని మించిన రాజధాని కడతాం అన్నారు.. ఇప్పుడు నిధులు కాదు అప్పులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ఎత్తు తగ్గించి మోసం చేశారని...రాష్ట్ర బిడ్డలకు ఉద్యోగాలు లేవని అన్నారు.

బీజేపీ మోసాల మీద బాబు,పవన్,జగన్ కనీసం స్పందన లేదని అన్నారు షర్మిల. బీజేపీ కి ఊడిగం చేస్తున్నారని.. బాబు ,పవన్ కూటమి కట్టి మోసం చేసిన బీజేపీతో పొత్తు  పెట్టుకున్నారని మండిపడ్డారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని అన్నారు. ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు జగన్ కి లేదని, 5 ఏళ్లు అధికారంలో ఉండి మద్యం మాఫియా నడిపించాడని అన్నారు. రైతులను నట్టేట ముంచారని అన్నారు షర్మిల.