
కోల్బెల్ట్, వెలుగు: ఒడిశాలోని అంగుల్జిల్లాలో సింగరేణి సంస్థకు చెందిన నైనీ ఓపెన్కాస్ట్ బొగ్గు గనిని బుధవారం సింగరేణి డైరెక్టర్లు సందర్శించారు. ఎగ్జిక్యూటివ్డైరెక్టర్, చీఫ్విజిలెన్స్ఆఫీసర్బి.వెంకన్న, డైరెక్టర్(ఆపరేషన్స్)ఎల్.వి.సుబ్రమణ్యం, ఇతర ఆఫీసర్లు ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా,స్టాక్యార్డు, డిస్పాచ్, కాంట్రాక్టులు, లాజిస్టిక్స్ వంటివి పరిశీలించారు.
ఈ సందర్భంగా నైనీ కోల్బ్లాక్లో బొగ్గు ఉత్పత్తి పురోగతి, ఆపరేషనల్ కెపాసిటీ, కస్టమర్లకు బొగ్గు సప్లై తీరుపై నైనీ ఏరియా జీఎం మజుందార్, ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. రోజూ16 వేల టన్నుల ఉత్పత్తిని టార్గెట్గా చేసుకున్నామని ఆఫీసర్లు పేర్కొన్నారు. అనంతరం బొగ్గును రవాణాకు ఏర్పాటు చేసిన అంగుల్జిల్లాలోని జారపాడ రైల్వే గూడ్స్షెడ్, హండప్ప రైల్వే గూడ్స్షెడ్లను పరిశీలించారు.
జారపాడ రైల్వే గూడ్స్షెడ్నుంచి రైల్వే సముద్రంరైల్వే (ఆర్ఎస్ఆర్) మార్గం ద్వారా పరాదీప్, ధమ్రా, గోపాలపురం పోర్టుల నుంచి తమిళనాడు జెన్కోకు బొగ్గు రవాణాపై సమీక్షించారు. ఈ సందర్భంగా కస్టమర్లకు సమయానుకూలంగా, సాఫీగా సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని నైనీ ఏరియా ఆఫీసర్లను సింగరేణి ఎగ్జిక్యూటివ్డైరెక్టర్, సీవీవో బి.వెంకన్న ఆదేశించారు.
తమిళనాడు జెన్కోకు ఏడాదికి 50లక్షల టన్నుల బొగ్గును సప్లై చేయాల్సి ఉందని, ఇందుకు రోజూ 4 రేక్ల చొప్పున ట్రాన్స్ పోర్ట్ చేయాలని ఈడీ ఆదేశించారు. మూడు రోజులుగా సింగరేణి డైరెక్టర్లు నైనీ కోల్బ్లాక్ ఏరియాలో పర్యటిస్తున్నారు.