
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణిలో ఉద్యోగం దక్కడం అదృష్టమని, యువ ఉద్యోగులు సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని మందమర్రి ఏరియా జీఎం జి.దేవేందర్అన్నారు. మెడికల్ఇన్వాలిడేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన యువతీయువకులకు శుక్రవారం జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన జాయినింగ్ఆర్డర్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటి వరకు కారుణ్య నియామకాల ద్వారా 1985 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు.
విధులకు గైర్హాజరు కాకుండా కష్టపడి పనిచేసి ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం మందమర్రి ఏరియా వర్క్షాప్లో జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్న బొగ్గు కుమారస్వామి కూతురు వైష్ణవికి స్కాలర్షిప్ కింద రూ.10 వేల చెక్కును జీఎం అందజేశారు. కార్యక్రమాల్లో ఏరియా పర్సనల్ మేనేజర్ఎస్.శ్యాంసుందర్, ఏఐటీయూసీ జీఎం స్ట్రక్చర్కమిటీ మెంబర్సీవీ రమణ, ఆఫీసర్ల సంఘం ప్రెసిడెంట్రమేశ్, డీవైపీఎం సత్యబోసు, ఆఫీస్ సూపరింటెండెంట్ రాయలింగు తదితరులు పాల్గొన్నారు.