
- ప్రైవేటీకరణను నిరసిస్తూ డ్యూటీకి హాజరుకాని కార్మికులు
- గనులపై భారీగా మొహరించిన పోలీసులు
- నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
హైదరాబాద్: బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మె ప్రారంభించారు సింగరేణి కార్మికులు. 72 గంటల పాటు దేశవ్యాప్తంగా ఉన్న సింగరేణిలో సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గనులపై పోలీసులు భారీగా మొహరించారు. కార్మికులందరూ విధులకు హాజరుకాకపోవడంతో బొగ్గు ఉత్పత్తి, రవాణా నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ ఏరియాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ సమ్మెలో టీబీజీకేఎస్, ఏఐటియుసి, ఐఎన్ టీయూసీ, సిఐటియు తదితర కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి.
ఖమ్మం జిల్లాలో..
సత్తుపల్లి లోని జే వి ఆర్ ఓపెన్ కాస్ట్ మరియు కిష్టారం ఓపెన్ కాస్ట్ ల లోని కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. రెండు ఓపెన్ కాస్ట్ లకు సంబంధించి సుమారు 750 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఒక్కరోజు కార్మిక సమ్మెలో సుమారు 25 వేల నుండి 30 వేల టన్నులు బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. జే వి ఆర్ ఓసి పి 3, కోయగూడెం ఓసి పి3, శ్రావణ పల్లి ఓసి పి, కేకే 6మైన్ ల కొరకు ఓపెన్ టెండర్లను పిలవడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి 72 గంటల పాటు సింగరేణిలో సమ్మె చేపట్టారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
సింగరేణి ని ప్రైవేటీకరణను నిరసిస్తూ మూడు రోజులు సమ్మెకు పిలుపునివ్వటంతో భూపాలపల్లి సింగరేణి కార్మికుల సమ్మె దిగారు. కార్మికులు విధులకు హాజరు కాక్ పోవటం తో గనుల పై నిర్మానుష్యంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం 4 బొగ్గు బ్లాకులను ప్రవేటు పరం చేయడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల రానున్న రోజుల్లో ఈ సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లాలో..
సింగరేణి కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. బొగ్గు గనుల వేలన్ని నిరసిస్తూ సింగరేణి వ్యాప్తంగా ఇవాళ్టి నుండి మూడు రోజుల సమ్మె ప్రారంభించారు. ఫలితంగా రామగుండం రీజీయన్ లోని ఆరు భూగర్బ గనులు, నాలుగు ఓపెన్ కాస్ట్ లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మికులు లేక బోసిపోతున్నాయి బొగ్గు గనులు. మరో వైపు సమ్మెను విజయవంతం చేయాలంటుూ బొగ్గుగనుల పై కార్మిక సంఘాల బైక్ ర్యాలీ చేపట్టాయి.