నమ్మి మోసపోయాను.. సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్

నమ్మి మోసపోయాను.. సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్

సింగర్ సునీత(Singer Sunitha).. తన అద్భుతమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ఆమె.. కేవలం పాటలు పాడటమే కాదు హీరోయిన్స్ కి తన గాత్ర దానం కూడా చేశారు. అలాగే బుల్లితెరపై ఎన్నో షోలకి యాంకర్ గా కూడా చేశారు. 

అయితే పైకి నవ్వుతూ.. ఆనందంగా కనిపించే సునీత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు దాగి ఉన్నాయి. కానీ వాటిని కనిపించకుండా.. బయటికి మాత్రం చురునవ్వుతో కనిపించేవారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు, నమ్మినవాళ్ళే తనని మోసం చేశారని చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు.  

ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ..  జీవితంలో కష్టాలనేవి సాధారణం కానీ.. మనం వాటిని ఎలా ఎదుర్కొన్నామనేది ముఖ్యం. ఇప్పటివరకు నా లైఫ్ లో జరిగిన చాలా విషయాలు నాకు ఎన్నో పాఠాలు నేర్పించాయి. వాటిని మా బంధువులు గుర్తు చేసినప్పుడు చాలా బాధేస్తుంది. నేను నమ్మినవాళ్ళే నన్ను మోసం చేశారు. చాలా రకాలుగా విమర్శలు చేశారు. 17 ఏళ్లకే సింగర్ గా కెరీర్ మొదలైంది. 19 ఏళ్లకి పెళ్లి, కుటుంబ బాధ్యతలు. 24 ఏళ్లకు కొడుకు,కూతురు. వ్యాపారంలో నాన్న ఇంటితో సహా అన్నీ కోల్పోయారు. అప్పటినుండి 35 ఏళ్ళు వచ్చే వరకు కష్టపడుతూనే ఉన్నాను.

ఈ 28 ఏళ్లలో 5 వేలకు పైగా షోలు చేశాను. దాని గురించి కాకండా.. నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేవారు. అవి విని చాలా బాధేసేది. అయినా కూడా కుంగిపోకుండా బలంగా నిలబడ్డాను. నా  జీవితంలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏదైనా ఉందంటే.. అది  రెండో వివాహం చేసుకోవడమే.. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు సునీత. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.