హయ్యెస్ట్..భారత్ లో ఒక్కరోజే 83,883 కేసులు

హయ్యెస్ట్..భారత్ లో ఒక్కరోజే 83,883 కేసులు

దేశంలో కరోనా రోజు రోజుకు  ఉగ్రరూపం దాల్చుతోంది. నిన్నటి వరకు దాదాపు 80 వేల వరకు కరోనా కేసులు నమోదవగా ఫస్ట్ టైం  నిన్న 80 వేలను దాటింది.నిన్న ఒక్కరోజే 83,883 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో  కరోనా కేసుల సంఖ్య 3853407 కు చేరింది. నిన్న ఒక్కరోజే 1043 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 67,376కు చేరింది. నిన్న ఒక్కరోజే  68, 584 మంది బాధితులు కోలుకోవడంతో దేశంలో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య  29,70,493 కు చేరింది.  ఇంకా 8,15,538 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక నిన్న ఒక్కరోజే 11,72,179 టెస్టులు చేశారు. వీటితో కలిపి దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 2 నాటికి కరోనా టెస్టుల సంఖ్య మొత్తం 4,55,09,380 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

ప్రజ్ఞాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

రాష్ట్రంలో కొత్తగా 2,817 కరోనా కేసులు.. 10 మంది మృతి