- శివసేన స్టేట్ చీఫ్ సింకారు శివాజీ
హైదరాబాద్, వెలుగు: హైకమాండ్ ఆదేశాల మేరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతామని శివసేన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సింకారు శివాజీ తెలిపారు. మంగళవారం ముంబైలో పార్టీ సెంట్రల్ కార్యదర్శి అభిజిత్ అడ్సుల్తో శివాజీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపి కిషన్భేటీ అయ్యారు. సమావేశం వివరాలను శివాజీ వెల్లడించారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాల్సిందిగా అడ్సుల్ సూచించారని చెప్పారు.
హైదరాబాద్లో త్వరలోనే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని వెల్లడించారు. ఆ సభకు ముఖ్య అతిథిగా మహారాష్ట్ర సీఎం, పార్టీ చీఫ్ ఏక్నాథ్ షిండేని ఆహ్వానించామని తెలిపారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనల వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. కానీ,ఈ సారి శివసేన ప్రభావాన్ని మాత్రం తెలంగాణలో కచ్చితంగా ఉంటుందని చెప్పారు.