అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులపై ఫోకస్

అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులపై ఫోకస్
  • శివసేన స్టేట్ చీఫ్ సింకారు శివాజీ

హైదరాబాద్, వెలుగు: హైకమాండ్ ఆదేశాల మేరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతామని శివసేన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సింకారు శివాజీ తెలిపారు. మంగళవారం ముంబైలో పార్టీ సెంట్రల్​ కార్యదర్శి అభిజిత్​ అడ్సుల్​తో శివాజీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపి కిషన్​భేటీ అయ్యారు. సమావేశం వివరాలను శివాజీ వెల్లడించారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాల్సిందిగా అడ్సుల్​ సూచించారని చెప్పారు. 

హైదరాబాద్​లో త్వరలోనే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని వెల్లడించారు. ఆ సభకు ముఖ్య అతిథిగా మహారాష్ట్ర సీఎం, పార్టీ చీఫ్​ ఏక్​నాథ్​ షిండేని ఆహ్వానించామని తెలిపారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనల వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. కానీ,ఈ సారి శివసేన ప్రభావాన్ని మాత్రం తెలంగాణలో  కచ్చితంగా ఉంటుందని చెప్పారు.