క్రాప్ లోన్ మాఫీ… పెన్షన్ లాక్కుంటున్న బ్యాంకు

క్రాప్ లోన్ మాఫీ… పెన్షన్ లాక్కుంటున్న బ్యాంకు

క్రాప్ లోన్ కోసం పెన్షన్ నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు  రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తికి చెందిన వృద్ధ రైతు లింగంపల్లి రాజయ్య. రెండు నెలలుగా తెలంగాణ దక్కన్ గ్రామీణ బ్యాంక్ అధికారులు తన పెన్షన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న తనకు..మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవన్నారు. గతంలో క్రాప్ లోను మాఫీ అయిందన్న అధికారులు.. ఇప్పుడు మళ్లీ కట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజయ్య.