
సిరిసిల్ల టౌన్, వెలుగు: డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతిఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్గా మారాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి.గీతే పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా అవగాహన వారోత్సవాల సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు స్టూడెంట్స్ పోలీస్ సిబ్బందితో కలిసి 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత గంజాయి, డ్రగ్స్కు బానిసై భవిష్యత్ను నాశనం చేసుకోవద్దన్నారు.
ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సోల్జర్గా మారి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారాన్ని స్టేట్ యాంటీ నార్కోటిక్బ్యూరో 8712671111కి లేదా డయల్100 లేదా మీ పరిధిలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐలు మొగిలి, నాగేశ్వరరావు, నటేశ్, మధుకర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ రవి, ఆర్ఐలు మధుకర్, రమేశ్, ఎస్ఐలు కిరణ్ కుమార్, రామ్మోహన్, శ్రీకాంత్, లక్ష్మణ్, శ్రీనివాస్, ఆర్ఎస్ఐ రాజు, సిబ్బంది, విద్యార్థులు, పీఈటీలు, ప్రజలు పాల్గొన్నారు.
డ్రగ్స్కు దూరంగా ఉండాలి
కోరుట్ల, వెలుగు: యువత డ్రగ్స్కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, వాటికి దూరంగా ఉండాలని సీఐ సురేశ్బాబు కోరారు. శుక్రవారం కోరుట్లలో ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్, ట్రాఫిక్స్ రూల్స్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్కు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పోస్టర్ ను అవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్సై రాంచంద్రం, కాలేజీ కరస్పాండెంట్ ప్రవీణ్ కుమార్, , విద్యార్థులు పాల్గొన్నారు.