దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం ఇందిగాంధీ కుటుంబం: సీతక్క

దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం ఇందిగాంధీ కుటుంబం: సీతక్క

నిర్మల్ జిల్లా : నిర్మల్ లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిర్మల్ అసెంబ్లీ కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర మంత్రి సీతక్క హాజరైయ్యారు. దేశం కోసం ఎంతో త్యాగం చేసిన కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబమని ఆమె అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి ఆ కుటుంబ రుణం తీర్చుకుందామని కార్యకర్తలను సీతక్క పిలుపునిచ్చారు. 

ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేసిన, బూత్ ల వారీగా ఓట్లు వచ్చిన నాయకులకే రాబోయే కాలంలో పార్టీ గుర్తింపు ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. అందుకే రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. భూకబ్జాలు, చెరువు కబ్జాలు చేసిన నాయకులను పార్టీలోకి తీసుకునేది లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.