
శివాజీ, లయ జంటకు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి నటించిన మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం సినిమాలు సక్సెస్ సాధించడంతో హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ చివరగా 2010లో ‘బ్రహ్మాలోకం టూ యమలోకం’ చిత్రంలో నటించారు. మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతోంది. సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శివాజీనే నిర్మిస్తున్నారు.
ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కొడుకు రిక్కీ కెమెరా స్విచాన్ చేశాడు. దర్శకుడు బోయపాటి శ్రీను ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. బెక్కెం వేణుగోపాల్ స్ర్కిప్ట్ను అందించారు. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అని, ఆగస్టు 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.