అత్తాపూర్–ఆరాం ఘర్ రహదారిపై బైక్ స్టంట్లతో బీభత్సం.. ఆరుగురు అరెస్ట్

అత్తాపూర్–ఆరాం ఘర్ రహదారిపై బైక్ స్టంట్లతో బీభత్సం.. ఆరుగురు అరెస్ట్

గండిపేట, వెలుగు: అత్తాపూర్–ఆరాంఘర్ రహదారిపై ప్రమాదకర బైక్ స్టంట్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆరుగురు యువకులను రాజేంద్రనగర్ టాస్క్‌‌ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు బైక్​లు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

అరెస్టయిన వారిలో హసన్​నగర్‌‌కు చెందిన సయ్యద్‌‌ షాహెద్‌‌, షేక్‌‌ నసీర్​హుస్సేన్‌‌, షేక్‌‌ జునైద్‌‌, కాలాపత్తర్​కు చెందిన బిన్‌‌ ఇసా, అబ్దుల్‌‌ సమద్‌‌, అర్బాజ్‌‌ హుస్సేన్‌‌ ఖాన్‌‌ ఉన్నారు. వీరిపై గతంలోనూ బహదూర్‌‌పురా, అత్తాపూర్ స్టేషన్లలో బైక్ స్టంట్లు, పోక్సో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.