హైదరాబాద్‌లో ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తి.. ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి

హైదరాబాద్‌లో ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తి.. ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ సెగ్మెంట్‌కు సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి... టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 1,05,710 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుకు 98,084 ఓట్లు పోలయ్యాయి. మూడో ప్లేస్‌లో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు 50,450 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 29,627 ఓట్లు వచ్చాయి.  ఆరు రౌండ్లు పూర్తి అయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి 7,626 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఆరు రౌండ్లలో కలిపి మొత్తం 19,914 ఓట్లు చెల్లని ఓట్లుగా తేలాయి.