కృష్ణా నదిలో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి

 కృష్ణా నదిలో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి

గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో స్నానానికి దిగిన ఆరుగురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్ధులు చనిపోయారు. శ్వేత శృంగాచలం వేద పాఠశాలకు చెందిన విద్యార్థులగా గుర్తించారు. డెడ్ బాడీస్ ని స్థానికులు వెలికితీశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మాదిపాడులోని వేదపాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు స్నానం చేసేందుకు కృష్ణానదిలోకి దిగారు. నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు వారంతా గల్లంతయ్యారు.