జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్లపల్లిలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం  ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి రక్తస్రావం జరగడాన్ని గుర్తించిన గ్రామస్థులు బాలికను ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు రమేష్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మొగుళ్ల పల్లి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన అయిలయ్య,రాజమ్మ లకు ఆరేళ్ల కూతురుంది. తమ బిడ్డను తల్లి దగ్గరుంచి.. అయిలయ్య జీవనోపాధి కోసం హైదరాబాద్ లోని ఓ ప్రవేటు హాస్పిటల్ లో పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉన్న తనను.. 19 ఏళ్ల రమేష్ బయటకు తీసుకెళ్లాడని బాధితురాలైన చిన్నారి చెప్పింది. ఆ తర్వాత ఆఘాయిత్యానికి పాల్పడ్డాడంది. బాలిక చెప్పింది విన్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు, మహిళలు.. రమేష్ ను పట్టుకుని కొట్టారు. పోలీసులకు అప్పగించారు. చికిత్స కోసం బాలికను కరీంగనర్ జిల్లా జమ్మికుంటలోని ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పించారు. కుటుంబ సభ్యుల కంప్లయింట్ తో పోలీసులు కేసు పెట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.

six-year-old-girl-raped-in-jayashankar-bhupalapalli-district