అభంశుభం తెలియని ఆరేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన ముంబైలో జరిగింది. వెస్ట్ మలాద్లోని ఓ పాఠశాలలో బాలిక చదువుకుంటుంది. బాలిక గురువారం స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే సమయంలో ఈ ఘోరం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి స్కూల్ వాష్రూంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని బాలిక చెప్పింది.
ఇంటికి వచ్చిన తర్వాత బాలిక స్కూళ్లో జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు బాలికను తీసుకొని వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన స్థానికులు పాఠశాల వద్దకు చేరుకొని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు నిరసనకారులకు హామీ ఇచ్చారు. పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
More News