స్కూళ్లో కాల్పులు జరిపిన ఆరో తరగతి బాలిక

స్కూళ్లో కాల్పులు జరిపిన ఆరో తరగతి బాలిక
  • అమెరికాలోని ఇడాహో స్టేట్‌లో ఘటన
  • కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు, టీచర్‌కు గాయాలు

అమెరికాలో గన్ కల్చర్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఒక స్కూళ్లో కాల్పుల మోత మోగింది. ఇడాహోలోని ఒక స్కూళ్లో ఆరవ తరగతి చదువుతున్న బాలిక కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఒక టీచర్ సహా ఇద్దరు విద్యార్ధులు గాయపడ్డారు. ఇడాహో సమీపంలోని రిగ్బీ మిడిల్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న 11 లేదా 12 ఏళ్ల వయసున్న బాలిక ఈ దారుణానికి ఒడిగట్టింది. బాలిక తన బ్యాగులో గన్ తీసుకొచ్చి స్కూళ్లో పలు రౌండ్లు కాల్పులు జరిపినట్లు జెఫెర్సన్ కౌంటీ షెరీఫ్ స్టీవ్ ఆండర్సన్ చెప్పారు. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు, ఒక టీచర్‌కు గాయాలయ్యాని.. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని ఆయన అన్నారు. ఈ ఘటనను ఎఫ్‌బీఐతో పాటు స్థానిక పోలీసులు కూడా విచారిస్తున్నారు.