
ఒకప్పుడు దర్శకుడిగా పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఎస్జే సూర్య.. ప్రస్తుతం నటుడిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇంత బిజీలోనూ మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. పదేళ్ల విరామం తర్వాత ఆయన తెరకెక్కించబోయే ఈ పాన్ ఇండియా మూవీని శుక్రవారం అనౌన్స్ చేశారు. ‘కిల్లర్’టైటిల్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు రివీల్ చేశారు.
ఈ చిత్రానికి తానే కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందిస్తూ, హీరోగా నటిస్తున్నాడు ఎస్జే సూర్య. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కాగా, హీరో కార్తి, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సహా పలువురు సినీ సెలబ్రిటీస్ హాజరై టీమ్కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
Hi folks , Ur Director S.J.Suryah is bk 🥰🥰🥰 with His Dream project titled, Yah U know it 🔥🔥🔥#KILLER🔥🔥🔥 feeling blessed and happy to collaborate with the most prestigious @GokulamMovies Gokulam Gopalan sir 🥰🥰🥰🥰 need Ur love and support as always🥰🥰🥰 love U all 🙏SJS… pic.twitter.com/XlLK5GY3Jb
— S J Suryah (@iam_SJSuryah) June 27, 2025
ఎస్జే సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్, గోకులం మూవీస్ బ్యానర్పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. దక్షిణాదిన పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గోకులం మూవీస్, ఈ సినిమాతో కోలీవుడ్కు కం బ్యాక్ ఇస్తోంది. ప్రీతి ఆస్రాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు.
@GokulamMovies proudly joins hands with @iam_SJSuryah for his next directorial – #KILLERTHEMOVIE
— SreeGokulamMovies (@GokulamMovies) June 27, 2025
A powerful pan-Indian film in Tamil, Telugu, Malayalam, Kannada & Hindi.@GokulamGopalan
Mr&Mrs #Maruthappapandianselvi#VCPraveen #BaijuGopalan#Krishnamoorthy @Kirubakaran_AKR pic.twitter.com/UvZZluqewb