గురక అనారోగ్యానికి దారితీస్తుంది

గురక అనారోగ్యానికి  దారితీస్తుంది

హైదరాబాద్, వెలుగు: గురక, నిద్రలేమి అనారోగ్యానికి దారితీస్తుందని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఆదివారం ఫిలింనగర్​లో స్లీప్​ థెరప్యుటిక్స్​ సెంటర్​ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గురక, నిద్ర రాకపోవడం, నిద్రలో నడవడం, అతిగా నిద్రపోవడం లాంటి సమస్యలతో బాధ పడుతున్నవారు ఈ సెంటర్​ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రాష్ట్రంలోనే మొట్ట మొదటి స్లీప్​ థెరప్యుటిక్స్​సెంటర్​ ఏర్పాటు చేసిన డాక్టర్​హర్షిణి ప్రతీక్​ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ప్లానింగ్​బోర్డు వైస్​ చైర్మన్​ వినోద్​కుమార్, మండలి చీఫ్​ విప్​భానుప్రసాద్​రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్​ వెంకటేశ్, డాక్టర్లు బీఎన్​ రావు, విజయ్ ​కుమార్, శుభాకర్, పవన్ పాల్గొన్నారు.