హైదరాబాద్, వెలుగు: గురక, నిద్రలేమి అనారోగ్యానికి దారితీస్తుందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం ఫిలింనగర్లో స్లీప్ థెరప్యుటిక్స్ సెంటర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గురక, నిద్ర రాకపోవడం, నిద్రలో నడవడం, అతిగా నిద్రపోవడం లాంటి సమస్యలతో బాధ పడుతున్నవారు ఈ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రాష్ట్రంలోనే మొట్ట మొదటి స్లీప్ థెరప్యుటిక్స్సెంటర్ ఏర్పాటు చేసిన డాక్టర్హర్షిణి ప్రతీక్ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ప్లానింగ్బోర్డు వైస్ చైర్మన్ వినోద్కుమార్, మండలి చీఫ్ విప్భానుప్రసాద్రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ వెంకటేశ్, డాక్టర్లు బీఎన్ రావు, విజయ్ కుమార్, శుభాకర్, పవన్ పాల్గొన్నారు.