పబ్లిక్ ప్లేసులో సిగరెట్ తాగి జైలుకు పోయిండు

పబ్లిక్ ప్లేసులో సిగరెట్ తాగి జైలుకు పోయిండు

పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగిన వ్యక్తికి ఎల్ బీనగర్ ఫస్ట్ క్లాస్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మూడు రోజుల జైలు శిక్ష వేశారు. మేడిపల్లి ఎన్ఐఎన్ కాలనీకి చెందిన బాలదీపక్ బుధవారం నైట్ ఆరుబయట స్మోక్ చేస్తుండగా, కాలనీవాసుల కంప్లయింట్ తో పెట్రోలింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో మూడు సార్లు కోర్టు రూ.50 చొప్పున ఫైన్ వేసింది. బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగిన వ్యక్తికి జైలు శిక్ష పడడం సిటీలో ఇదే ఫస్ట్ టైమ్.