
- సోషల్మీడియా ఇన్ఫ్లూయన్సర్ మీనాల్ తల్లి, చెల్లిపై దాడి
- జూబ్లీహిల్స్పీఎస్లో కేసు నమోదు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ బేబీలాన్ కిచెన్అండ్బార్లో ఆర్డర్ చేయని డ్రింక్స్కు బిల్స్ఎందుకు వేశారని అడిగినందుకు తన తల్లిని కొట్టారని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మీనాల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె కథనం ప్రకారం.. మీనాల్ తల్లి, చెల్లి, మరో వ్యక్తితో కలిసి మంగళవారం జూబ్లీహిల్స్లోని బేబీలాన్కిచెన్ హోటల్కు వెళ్లారు. ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాక హోటల్సిబ్బంది బిల్లు ఇచ్చారు. కానీ, అందులోని రూ.1,980 విలువు చేసే డ్రింక్స్తాము ఆర్డర్ చేయలేదని మీనాల్తల్లి వారికి చెప్పింది.
ఆర్డర్చేయని వాటికి బిల్లు ఎలా కడతామని ప్రశ్నించింది. అయితే, వారు దీన్ని ఒప్పుకోకుండా, డ్రింక్స్సర్వ్చేశామని బిల్లు కట్టాల్సిందేనని సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో హోటల్యజమాని, సిబ్బంది ఆగ్రహంతో లైట్లు ఆపేసి మీనాల్తల్లి, చెల్లిని బూతులు తిడుతూ దాడి చేశారు. ఫోన్లు లాక్కొని ఇబ్బంది పెట్టారు. దీన్నంతా వీడియో తీస్తుంటే బెదిరించారు. బాధితులు బేబీలాన్ హోటల్పై జూబ్లీహిల్స్పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.