నందిపేట మండలంలో గణేశ్ ​నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు

నందిపేట మండలంలో గణేశ్ ​నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు

నందిపేట, వెలుగు : గణేశ్​ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు సూచించారు. మంగళవారం నందిపేట మండలం ఉమ్మెడ శివారులోని గోదావరి నదిలో విగ్రహాలను ​నిమజ్జనం చేసే ప్రాంతాన్ని సీపీ సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ ​విఠల్​రావు తో కలిసి పరిశీలించారు. 

నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉమ్మెడ, కొండూర్​ సర్పంచులకు ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.