నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ ఎస్సై చిటన్నోజు భాస్కరచారి బుధవారం ఏసీబీ చిక్కాడు. ఓ బాలుడిని కేసు నుంచి తప్పించడానికి రూ.7 వేలు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇందులో 16 ఏండ్ల బాలుడి ప్రమేయం ఉందంటూ అతని కుటుంబీకులకు ఎస్సై భాస్కర్చారి సమాచారం ఇచ్చి కేసు లేకుండా చేయడానికి రూ.10 వేలు డిమాండ్ చేశారు. బాలుడి బంధువైన మున్సిపల్ కౌన్సిలర్ ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ను సంప్రదించి విషయం చెప్పారు. ఆయన సూచనల మేరకు బుధవారం రూ.7 వేలు ఇవ్వగా, ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఎస్సైని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు.
