శంషాబాద్, వెలుగు: కని పెంచిన తల్లి కరోనాతో చనిపోవడంతో ఆ కొడుకు తట్టుకోలేకపోయాడు. దీంతో చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మైలార్ దేవ్ పల్లిలో జరిగింది. రామచందర్, రుక్మిణి (60) దంపతులు మైలార్దేవ్పల్లిలోని మధుబన్ కాలనీలో ఉంటున్నారు. రామచందర్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. అతడి కొడుకు శ్రీహరి (22)తో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. వారం కింద రుక్మిణికి కరోనా రా వడంతో ఆమెను గచ్చిబౌలిలోని ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. కోలుకుంటున్న రుక్మిణికి అప్పటికే రెండు కిడ్నీలు పాడైపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయింది. అప్పటికే ట్రీట్మెంట్ కోసం రూ.10 లక్షలు ఖర్చు చేశారు. తల్లి మృతిని తట్టుకోలేక కొడుకు శ్రీహరి అదేరోజు సాయంత్రం పహాడీ షరీఫ్లోని లక్ష్మీగూడ కొత్త చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. అంతకుముందు తన తల్లిని డాక్టర్లే చంపేశారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ట్రీట్మెంట్కు చేసిన అప్పులను ఇల్లు అమ్మి తీర్చాలని చెప్పాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, శనివారం మధ్యాహ్నం శ్రీహరి డెడ్ బాడీని చెరువులో నుంచి బయటికి తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.