అమెరికాలో మనోళ్లిద్దరికి కీలక పదవులు

అమెరికాలో మనోళ్లిద్దరికి కీలక పదవులు

నామినేట్ చేసిన ప్రెసిడెంట్ జో బైడెన్

హోస్టన్: భారత సంతతికి చెందిన మరో ఇద్దరిని అమెరికా ప్రభుత్వం కీలక పదవుల్లో నియమించింది. అమెరికా కోర్​ స్టేట్ అండ్ నేషనల్ డైరెక్టర్​గా సోనాలి నిజావన్, విదేశీ వ్యవహారాల చీఫ్ గా ప్రిస్టన్ కులకర్ణిని అపాయింట్ చేసింది. కులకర్ణి డెమొక్రటిక్ పార్టీ తరఫున టెక్సాస్ నుంచి కాంగ్రెస్ కు రెండు సార్లు పోటీ చేసి ఓడినప్పటికీ బైడెన్ సర్కారు ఆయనకు కీలక పోస్ట్ అప్పగించింది. కులకర్ణి, సోనాలి నియామకం.. బైడెన్ కమిట్​మెంట్​కు, లీడర్​షిప్ కు నిదర్శనమని అమెరికా కోర్ పేర్కొంది. కొత్తగా నియామకం అయినవాళ్లు ఇప్పడున్న పరిస్థితుల్లో కరోనా, ఆర్థిక సంక్షోభం, రేషియల్ ఈక్వాలిటీ, క్లైమెట్ చేంజ్ వంటి అత్యవసర సవాళ్లను ఎదుర్కోవడంపై దృష్టి సారిస్తారని, అడ్మినిస్ట్రేషన్ ఎజెండాకు సపోర్టుగా సేవలందిస్తారని వెల్లడించింది.