హాస్పిటల్ లో చేరిన సోనియా గాంధీ

హాస్పిటల్ లో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ  మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. సాధారణ పరీక్షల నిమిత్తం  ఆమె ఆస్పుత్రిలో చేరినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోనియాకు కరోనా బారిన పడిన తరువాత కొన్ని రోజులు సర్ గంగారామ్ ఆసుపత్రిలోనే ఉన్నారు. అప్పటినుంచి ఆమె రెగ్యూలర్ చెకప్ చేయించుకుంటున్నారు. సోనియాతో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆసుపత్రికి వెళ్లారు. ఈ రోజు రాహుల్ భారత్ జోడో యాత్రలో ఆమె పాల్గోనలేదు.