మార్పు కోసం కాంగ్రెస్కి ఓటేయండి.. తెలంగాణ ప్రజలకు సోనియా లేఖ

మార్పు కోసం కాంగ్రెస్కి ఓటేయండి.. తెలంగాణ ప్రజలకు సోనియా లేఖ

అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం పంపించారు. ఎలక్షన్స్ వేళ తాను రాష్ట్ర ప్రజలకు దగ్గరగా రాలేకపోతున్నానని, కానీ, రాష్ట్ర ప్రజలు తన గుండెకు చాలా దగ్గరగా ఉంటారని చెప్పారు. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తవడం తాను చూడాలనుకుంటున్నానని చెప్పారు. తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దొరల తెలంగాణని.. ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణ ప్రజల కలలు సహకారం కావాలని ఆకాక్షించారు. ప్రజల మంచి ప్రభుత్వం లభించాలన్నారు. తనను సోనియమ్మ అని పిలిచి చాలా గౌరవం ఇచ్చారని చెప్పారు.  తెలంగాణ ప్రేమ ,అభిమానాలకు తాను ఎప్పటికి రుణపడి ఉంటానన్నారు. మార్పు కోసం కాంగ్రెస్ కి ఓటేయండి..  మార్పు కావాలి ..కాంగ్రెస్ రావాలి అంటూ పిలుపునిచ్చారు.