నర్సింహులపేట, వెలుగు: మద్యం తాగేందుకు తల్లి డబ్బులు ఇవ్వలేదని ఇద్దరు కొడుకులు ఆమెను కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన అడెపు కౌసల్య(68)కు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు నారాయణ సూర్యాపేట జిల్లా నిమ్మికల్ లో ఉంటున్నాడు. రెండో కొడుకు రమేష్ మద్యానికి బానిసై భార్యను వదిలి తల్లి వద్ద ఉంటున్నాడు. మూడో కొడుకుకు పెళ్లి కాలేదు. ఇద్దరు కొడుకులు తరచూ మద్యానికి డబ్బులివ్వాలంటూ తల్లితో గొడవపడేవారు. జులై 29న ఇలానే గొడవపడ్డారు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో పక్కనే ఉన్న పైపుతో తలపై బలంగా కొట్టారు. దీంతో కౌసల్య మృతిచెందింది. ఇద్దరూ విషయం దాచి దహన సంస్కారానికి ఏర్పాట్లు చేశారు. పెద్దకొడుకు అనుమానంతో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దహన సంస్కారాన్ని అడ్డుకున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో తలపై బలంగా కొట్టడంతో మృతిచెందినట్లు తేలింది. దీంతో ఇద్దరిని అరెస్టు చేశారు.
తల్లిని చంపిన కొడుకులు అరెస్ట్
- తెలంగాణం
- August 12, 2021
లేటెస్ట్
- Harish Shankar Open Letter: మర్యాద ఇస్తూనే చోటాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్
- Gautam Gambhir: గంభీర్ వింత సమాధానం.. మెస్సీ, రోనాల్డో ఇష్టం లేదంటూ మరొకరి పేరు
- ఓటు వేయడం మర్చిపోకండి: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
- మోకాళ్ల యాత్ర చేసినా కేసీఆర్ను నమ్మరు... ఎంపీ లక్ష్మణ్
- 2024 Hanumanth Jayanti Special: కోటిమొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న
- ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : వికాస్ రాజ్
- ఇండోనేషియాలో భారీ అగ్ని పర్వత విస్ఫోటనాలు..సునామీ వస్తుందా?
- శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్…
- Vijay Antony: నెగెటివ్ రివ్యూలు చెప్పిన వారిపై..విజయ్ ఆంటోనీ పోస్ట్ వైరల్
- ఏప్రిల్ 23 ఆంజనేయస్వామి బర్త్ డే: భారతదేశంలో విశిష్టత ఉన్న హనుమంతుని గుళ్లు ఇవే..
Most Read News
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం