బేకరీ వస్తువులు కల్తీ చేస్తున్న ముఠాపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లంపేటలో ఉన్న ఎస్వీ బేకరీలో కాలం చెల్లిన పదార్థాలతో బేకరీ వస్తువులు తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బేకరీపై దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో ఎక్స్పైర్అయిన వస్తువులు, కెమికల్స్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు దామోదర్రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండా బేకరీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్సేఫ్టీని గాలికొదిలేసినట్లు తనిఖీల్లో వెల్లడైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSOREAD :పాలు, జ్యూస్ ల తరహాలో.. టెట్రా ప్యాకెట్లలో మందు
హైదరాబాద్లో ఆహార పదార్థాల కల్తీ వ్యవహారం ప్రజల ఆరోగ్యానికి సవాలుగా మారుతోంది. ఈ మధ్యే అల్లం వెల్లుల్లి పేస్ట్, తదితర ఫుడ్ ఐటెమ్స్ కల్తీ జరిగిన ఘటనలు బయటపడ్డాయి. పోలీసుల తనిఖీల్లో నిత్యం ఏదో చోట ఇలాంటివి జరుగుతుండటం ప్రజల ఆరోగ్యాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.