చివరికి బేకరిలో కూడా కల్తీ ఆగట్లేదు... బేకరీ ప్రియులారా.. హై అలర్ట్​

చివరికి బేకరిలో కూడా కల్తీ ఆగట్లేదు... బేకరీ ప్రియులారా.. హై అలర్ట్​

బేకరీ వస్తువులు కల్తీ చేస్తున్న ముఠాపై ఎస్​ఓటీ పోలీసులు దాడులు చేశారు. దుండిగల్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మల్లంపేటలో ఉన్న ఎస్​వీ బేకరీలో కాలం చెల్లిన పదార్థాలతో బేకరీ వస్తువులు తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బేకరీపై దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో ఎక్స్​పైర్​అయిన వస్తువులు, కెమికల్స్​ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు దామోదర్​రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండా బేకరీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్​సేఫ్టీని గాలికొదిలేసినట్లు తనిఖీల్లో వెల్లడైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ALSOREAD :పాలు, జ్యూస్ ల తరహాలో.. టెట్రా ప్యాకెట్లలో మందు

హైదరాబాద్లో ఆహార పదార్థాల కల్తీ వ్యవహారం ప్రజల ఆరోగ్యానికి సవాలుగా మారుతోంది. ఈ మధ్యే అల్లం వెల్లుల్లి పేస్ట్​, తదితర ఫుడ్​ ఐటెమ్స్​ కల్తీ జరిగిన ఘటనలు బయటపడ్డాయి. పోలీసుల తనిఖీల్లో నిత్యం ఏదో చోట ఇలాంటివి జరుగుతుండటం ప్రజల ఆరోగ్యాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.