దాదాను కలిసిన కోహ్లీ , రోహిత్‌

 దాదాను కలిసిన కోహ్లీ , రోహిత్‌

ముంబై: టీమిండియా కెప్టెన్​ విరాట్‌ కోహ్లీ, వైస్‌‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. గురువారం బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షాతో సమావేశమయ్యారు. సెలెక్షన్​ కమిటీ సమావేశం తర్వాత ఇది చోటు చేసుకుంది. ఇండియన్​ క్రికెట్ ఫ్యూచర్‌ కు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ పై చర్చిం చినట్లు సమాచారం. అలాగే మాజీ సారథి ధోనీ భవితవ్యం చర్చకు వచ్చినా…ఏం మాట్లాడారనే అంశాలను ఎవరూ బహిర్గతం చేయడం లేదు. చీఫ్ కోచ్​ రవిశాస్ర్తి ఈ సమావేశానికి దూరంగా ఉన్నాడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌‌తో కోల్‌‌కతాలో జరిగే టెస్ట్ మ్యాచ్‌ లో దాదా , శాస్త్రి మాట్లాడుకునే అవకాశం ఉందని తెలుస్తోం ది.\