కోహ్లీకి షోకాజ్ నోటీసులపై స్పందించిన బీసీసీఐ బాస్

కోహ్లీకి షోకాజ్ నోటీసులపై స్పందించిన బీసీసీఐ బాస్

విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపాలనుకున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలి. అవన్నీ.. అర్థం లేని వార్తలని కొట్టిపారేశారు. అందులో నిజం లేదని... ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అని వ్యాఖ్యానించారు. గతేడాది టీ 20 వరల్డ్ కప్ తర్వాత టీ 20 కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకున్నారు. టీ 20తో పాటు వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించి.. రోహిత్ ని నియమించింది బీసీసీఐ. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించినట్లు.. కేవలం గంటన్నర ముందే సమాచారమిచ్చారని సౌతాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై గంగూలీ షోకాజ్ నోటీసులు పంపాలనుకున్నట్లు వార్తలు బయటికొచ్చాయి.