బెంగళూరు: ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన దులీప్ ట్రోఫీ సెమీస్లో సౌత్ జోన్ గట్టెక్కింది. ఛేజింగ్లో మయాంక్ అగర్వాల్ (54), హనుమ విహారి (43), రికీ భుయ్ (34) నిలకడగా ఆడటంతో.. శనివారం ముగిసిన ఈ మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో నార్త్ జోన్పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. 215 రన్స్ టార్గెట్ ఛేజింగ్లో21/0 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 219/8 స్కోరు చేసింది. తిలక్ వర్మ (25) ఫర్వాలేదనిపించాడు.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో..
సెంట్రల్ జోన్తో జరిగిన సెమీస్ మ్యాచ్ను డ్రా చేసుకున్న వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో టైటిల్ ఫైట్కు అర్హత సాధించింది. 390 రన్స్ టార్గెట్ను ఛేదించేందుకు ఆఖరి రోజు బరిలోకి దిగిన సెంట్రల్ జోన్ మ్యాచ్ చివరకు 128/4 స్కోరు చేసింది. రింకూ సింగ్ (40), అమన్దీప్ (27 నాటౌట్), ధ్రువ్ జురెల్ (25) రాణించారు. అంతకుముందు 292/9 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన వెస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 297 రన్స్కు ఆలౌటైంది. ఈ నెల 12 నుంచి జరిగే ఫైనల్లో సౌత్.. వెస్ట్తో తలపడుతుంది.