సావరిన్ గోల్డ్‌‌ బాండ్లు.. గ్రాము ధర రూ. 4,790

సావరిన్ గోల్డ్‌‌ బాండ్లు.. గ్రాము ధర రూ. 4,790
  • ఇయ్యాల్టి నుంచే 5వ విడత సావరిన్ గోల్డ్‌‌ బాండ్లు
  • గ్రాము ధర రూ. 4,790

న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్‌‌ బాండ్ల ఐదో విడత ఇష్యూ సోమవారం ఓపెన్ కానుంది. ఐదు రోజుల పాటు ఈ ఇష్యూ అందుబాటులో ఉంటుంది.  గోల్డ్‌‌ బాండ్లు ఈ నెల 17 న కస్టమర్లకు అందుతాయి. ఈ సారి గోల్డ్ ధర గ్రాముకి రూ.4,790 గా నిర్ణయించారు. నాలుగో విడత ఇష్యూలో గోల్డ్ ధర గ్రాముకి రూ.4,807 గా ఉంది. ఈ ఏడాది జులై 12 –16 మధ్య నాల్గో విడత సావరిన్ బాండ్ల ఇష్యూ అందుబాటులోకి వచ్చింది. సావరిన్ గోల్డ్‌‌ బాండ్లను ఆన్‌‌లైన్ ద్వారా సబ్‌‌స్క్రయిబ్ అయితే గ్రాముపై రూ.50 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో గ్రాము గోల్డ్‌‌ రూ.4,740 కే దొరుకుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఆరు విడతల్లో సావరిన్ గోల్డ్ బాండ్లను ఇష్యూ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఐదు విడతలే అందుబాటులోకి వచ్చాయి.  సావరిన్ గోల్డ్ బాండ్లను ప్రభుత్వం తరపున ఆర్‌‌‌‌బీఐ అమ్ముతోంది. అన్ని బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్‌‌ ఆఫ్ ఇండియా, పోస్ట్ ఆఫీస్‌‌లు, ఎన్‌‌ఎస్‌‌ఈ, బీఎస్‌‌ఈలలో వీటిని అమ్ముతున్నాయని ఆర్​బీఐ తెలిపింది.