సర్కార్ సప్లై చేసిన సోయా సీడ్స్ జిల్లాలో చాలాచోట్ల మొలకెత్తలేదు. సర్కార్ సబ్సిడీతో సొసైటీల ద్వారా సోయా సీడ్స్సరఫరా చేయగా రైతులు పది రోజుల కింద వేశారు. ఇప్పటివరకు మొలకలు కనిపించక పోవడంతో లబోదిబోమంటున్నారు. సర్కార్ సరిపడ సీడ్స్ ఇవ్వకపోవడంతో కొందరు ప్రైవేట్డీర్లవద్ద కొనుగోలు చేసి వేయగా అవి మొలకలు వచ్చాయి. ఈ వానాకాలం సీజన్లో ప్రభుత్వం మొక్కజొన్న బదులు సోయాపంట వేసుకోవాలని సూచించింది. ఈమేరకు జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్లు పంటల సాగు ప్రణాళిక రూపొందించా రు. జిల్లాలో 1.09 లక్షల ఎకరాల్లో సోయా వేయాలని నిరయ్ణ ించింది. గత ఏడాది కంటే ఈసారి 42 వేల ఎకరాలను పెంచారు. పత్తిపంట కూడా వేసుకునే అవకాశంఉన్నాచాలామంది సోయా పంట సులువుగా ఉంటుందని, మద్దతు ధర కూడా పెంచడంతో రైతులు మొగ్గుచూపారు. కానీ సర్కారు సప్లయ్ చేసిన సీడ్స్వేసి మొలకెత్తకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఐదు ఏజెన్సీల ద్వారా సర్కారీ సీడ్స్ సరఫరా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరపై సప్లయ్ చేస్తున్న సోయా సీడ్స్ టీఎస్ఎస్డీసీ, హెచ్ఏసీఏ(హాకా), ఎన్ఎన్సీ, మార్క్ ఫెడ్, ఆయిల్ ఫెడ్ ఏజెన్సీల ద్వారా జిల్లాలో సింగిల్ విండో, సొసైటీల ద్వారా సరఫరా చేస్తోంది. సర్కారు సప్లైచేసే సీడ్స్కావడం, సబ్సిడీ పోనూ మార్కెట్రేటు కన్నా తక్కువకు లభిస్తుండడంతో చాలామంది రైతులు కొనుగోలు చేశారు. కానీ అవి మొలకెత్తక పోవడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. మళ్లీ సీడ్స్ కొనుగోలు సర్కారు సోయా సీడ్స్ మొలకెత్తకపోవడంతో నిరాశ చెందిన రైతులు భూమిని మరోసారి దున్నించి ప్రైవేట్ సీడ్స్ వద్దకు వెళ్తున్నారు. ప్రైవేట్లో బాహుబలి, కరిష్మా, సంపత్, ఈగల్ రకాలను కొంటున్నారు. కాగా, సర్కారు సప్లయ్ చేసిన 30 కిలోల సో యా సీడ్స్ బస్తా ధర రూ.1,190 ఉంది. బయటి మార్కెట్లో బస్తాకు రూ. 2,550 నుంచి రూ.2,700 ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నారు.

