
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్పోలీస్ కంట్రోల్ రూమ్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ కుట్టె శివాజీ (56) అనారోగ్యంతో మృతి చెందారు. శివాజీ ఏడాది కాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారు. బుధవారం పరిస్థితి విషమించడంతో రిమ్స్కు తరలిస్తుండగా చనిపోయారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సంజయ్నగర్లోని శివాజీ నివాసానికి వెళ్లి ఆయన బౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జిల్లా పోలీస్ అసోసియేషన్ తరఫున వారికి రూ.30 వేలు అందించారు. అంతిమ కార్యక్రమంలో ఎస్పీతో పాటుగా డీఎస్పీ జీవన్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి.వెంకటి పాల్గొన్నారు.