గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పార్థివ దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నైశివారులోని తామరైపాక్కంలోని ఫాంహౌస్ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. హిందూ సంప్రదాయ ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక ఖననం చేశారు. ఎస్పీ బాలుకు కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. బాలు అంత్యక్రియలకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.
దేశంలో 59 లక్షల కేసులు.. 93 వేల మరణాలు
వీరాట్ కోహ్లీకి రూ.12 లక్షల ఫైన్