మత్తు పదార్థాల రవాణాపై కఠినంగా వ్యవహరించాలి : సింధూశర్మ

మత్తు పదార్థాల రవాణాపై కఠినంగా వ్యవహరించాలి :  సింధూశర్మ

కామారెడ్డి, వెలుగు: మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ సింధూశర్మ పోలీస్​ ఆఫీసర్లకు ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్​ ఆఫీస్​లో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారి రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళల రక్షణకు పెద్దపీట వేయలన్నారు. మిస్సింగ్​ కేసులపై స్పెషల్ ఫోకస్​ పెట్టాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవొద్దన్నారు.

ప్రతీ ఆఫీసర్​ పారదర్శకంగా డ్యూటీ చేయాలని సూచించారు. సైబర్​ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్టేషన్ల వారీగా పెండింగ్​లో ఉన్న కేసులపై సమీక్షించారు. అనంతరం సైబర్​ నేరాలకు సంబంధించిన అవగాహన పోస్టర్​రి లీజ్​చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన ఆఫీసర్లు, సిబ్బందికి అవార్డులు అందించారు. ట్రైనీ ఐపీఎస్​ కాజల్​సింగ్, అడిషనల్​ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు ప్రకాశ్,శ్రీనివాస్, జగన్నాథ్​రెడ్డి, మదన్​లాల్, శ్రీనివాస్, ఎస్బీ సీఐ సంతోష్​కుమార్​ పాల్గొన్నారు.