కియా కార్ల షోరూమ్​ను ప్రారంభించిన స్పీకర్

కియా కార్ల షోరూమ్​ను ప్రారంభించిన స్పీకర్

డిచ్​పల్లి, వెలుగు: డిచ్​పల్లి మండలం బర్దీపూర్​వద్ద కొత్తగా ఏర్పాటైన కియా కార్ల షోరూమ్​ను శాసనసభ స్పీకర్​ పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రారంభించారు. కియా లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ తన షోరూమ్​ను జిల్లాలో ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.

ఈ సందర్భంగా కియా ఈవీ6 ఎలాక్ట్రిక్​కారు ను లాంచ్​ చేశారు. కార్యక్రమంలో కియా ఇండియా రీజినల్​మేనేజర్​జాంగో రైయు, పోచారం సురేందర్​రెడ్డి, రవి కిరణ్​గౌడ్​గిల్ల, ప్రజాప్రతినిధులు, లీడర్లు పాల్గొన్నారు. 

ALSO READ: అసత్యాలు ప్రచారం చేస్తే చర్యలు : ఇలా త్రిపాఠి