గిరిజనుల అభివృద్ధికి కృషి : పోచారం శ్రీనివాస్​రెడ్డి

గిరిజనుల అభివృద్ధికి కృషి : పోచారం శ్రీనివాస్​రెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు: గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్మించనున్న బంజరా భవన్​కు ఆదివారం స్పీకర్​ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంజారా భవన్​ బిల్డింగ్ నిర్మాణానికి ఎకరం స్థలం కేటాయించామని, ఫండ్స్​కోసం త్వరలోనే  సీఎంను కలువనున్నట్లు చెప్పారు.

ప్రభుత్వం ఎస్టీల కోసం ప్రత్యేకంగా రెసిడెన్సియల్ స్కూళ్లను ఏర్పాటు చేసిందని, పోడు భూములపై వారికి హక్కులు కల్పించిందన్నారు. జిల్లాలో ఇప్పటికే 11,365 ఎకరాలకు గాను 5,013 మందికి ఆర్వోఎఫ్ఆర్​పట్టాలు ఇచ్చామన్నారు. ప్రోగ్రామ్​లో విప్​గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, స్టేట్​ఉర్దూ అకాడమీ చైర్మన్​ ముజీబోద్దీన్, రైతుబంధు జిల్లా ప్రెసిడెంట్​అంజిరెడ్డి, బంజరా ప్రతినిధులు బద్యానాయక్, రాంసింగ్ పాల్గొన్నారు.