నెట్వర్క్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన నేతల వారసుల్లో పలువురు విజయం సాధించగా.. కొందరు ఓటమి పాలయ్యారు. వికారాబాద్లో కాంగ్రెస్ నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు అనన్య (24), నారాయణఖేడ్లో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ తమ్ముడు నరేశ్ షెట్కార్ విజయం సాధించారు. అంతేకాకుండా వారు చైర్ పర్సన్ రేసులోనూ ఉన్నారు. వికారాబాద్లో 17వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం అనన్య పోటీ చేశారు.
1,138 మెజారిటీతో బీజేపీ అభ్యర్థి దయాకర్ పై ఆమె గెలిచారు. దయాకర్ కు 81 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ క్యాండిడేట్ బీఫాంసమర్పించిన తర్వాత కాంగ్రెస్ లో చేరారు. వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో అతిపిన్న వయస్సులో (24) ఆమెకు ఆ పదవి లాంఛనం అయ్యింది.
ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఎంపీ సురేశ్ షెట్కార్ సోదరుడు నగేశ్ షెట్కార్ 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఖేడ్లో 15 వార్డులకుగాను కాంగ్రెస్ 11 చోట్ల గెలుపొందింది. ఇదివరకే నగేశ్ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో చైర్ పర్సన్గా ఆయన ఎంపిక ఖాయమైనట్టే.
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి జోగు రామన్న కొడుకు, మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఓటమి పాలయ్యారు. ప్రేమేందర్ బీఆర్ఎస్ తరపున 34 వార్డు నుంచి పోటీ చేయగా ఆయన మూడో ప్లేస్లో నిలిచారు. ఈ వార్డును మజ్లిస్ కైవసం చేసుకుంది. ఇక్కడ మజ్లిస్ అభ్యర్థి నజీర్కు 638 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన బీజేపీ క్యాండిడేట్ వకుళాభరణం నిఖిల 626 ఓట్లు పొందారు. ప్రేమేందర్కు 507ఓట్లు వచ్చాయి. కాగా.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు ఈసారి 6 సీట్లు మాత్రమే వచ్చాయి.
