YS విజయమ్మ, షర్మిలకు ప్రత్యేక కోర్టు సమన్లు

YS విజయమ్మ, షర్మిలకు ప్రత్యేక కోర్టు సమన్లు

YCP గౌరవాధ్యక్షురాలు YS విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిలకు హైదరాబాదులోని ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 10న హాజరు కావాలంటూ ఆదేశించింది. రోడ్డుపై ముందస్తు అనుమతి లేకుండా సభను నిర్వహించారన్న ఫిర్యాదుతో కోర్టు ఈ సమన్లు జారీ చేసింది.

2012లో ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ ఏర్పాటు చేశారని..దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పరకాల పోలీస్ స్టేషన్ లో YS విజయమ్మ, షర్మిలపై కేసు నమోదైంది. ఈ కేసులోనే వారిద్దరితో పాటు తెలంగాణ రాజకీయ నేతలు కొండా సురేఖ, కొండా మురళిలకు కూడా సమన్లు జారీ చేసింది. నలుగురు జనవరి 10న ప్రత్యేక  కోర్టులో హాజరు కావాల్సి ఉంది.

మరోవైపు ఏపీ సీఎం జగన్ కూడా అదే రోజు CBI కోర్టుకు రానున్నారు.