
మత్తు వదలరా’ చిత్రంతో సక్సెస్ను అందుకున్న కీరవాణి కొడుకు శ్రీసింహ కోడూరి... ఇప్పుడు దీని సీక్వెల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సత్య, ఫరియా అబ్దుల్లా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన స్పెషల్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఫస్ట్ పార్ట్ కంటే నెక్స్ట్ లెవల్లో ఎంటర్టైన్ చేసేలా సీక్వెల్ ఉంటుందని మేకర్స్ చెప్పారు.
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 13న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.