- రేపటి నుంచి జూన్ 30 వరకు అందుబాటులో..
సికింద్రాబాద్, వెలుగు: వేసవి నేపథ్యంలో తెలం గాణ నుంచి బిహార్, ఉత్తర్ప్రదేశ్వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే దానాపూర్వరకు ప్రత్యేక రైలును నడపనుంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 18 నుంచి జూన్30 వరకు ఈ రైలును అందుబాటులోకి తెస్తోంది. రెగ్యులర్గా సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వరకు నడిచే ఎక్స్ప్రెస్ మాదిరిగా వారానికోసారి అన్ రిజర్వుడ్ రైలును నడపనుంది.
ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి దానాపూర్ వెళ్తుంది. శనివారం దానాపూర్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ వస్తుంది. జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, నాగ్పూర్, ఇటార్సి, పిపారియా, జబల్ పూర్, కట్నీ జంక్షన్, సాత్నా, మాణిక్పూర్జంక్షన్, ప్రయాగ్రాజ్, వారణాసి, చెయోకీ, పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, బక్సర్, ఆరా స్టేషన్లలో ఆగుతుంది.