సికింద్రాబాద్, దానాపూర్ మధ్య స్పెషల్​ట్రైన్

సికింద్రాబాద్, దానాపూర్ మధ్య స్పెషల్​ట్రైన్
  •  రేపటి నుంచి జూన్ 30 వరకు అందుబాటులో.. 

సికింద్రాబాద్, వెలుగు: వేసవి నేపథ్యంలో తెలం గాణ నుంచి బిహార్, ఉత్తర్​ప్రదేశ్​వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే దానాపూర్​వరకు ప్రత్యేక రైలును నడపనుంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 18 నుంచి జూన్​30 వరకు ఈ రైలును అందుబాటులోకి తెస్తోంది. రెగ్యులర్​గా సికింద్రాబాద్​ నుంచి దానాపూర్ వరకు నడిచే ఎక్స్​ప్రెస్ ​మాదిరిగా వారానికోసారి అన్ ​రిజర్వుడ్ ​రైలును నడపనుంది. 

ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి దానాపూర్​ వెళ్తుంది. శనివారం దానాపూర్​ నుంచి బయలుదేరి సికింద్రాబాద్​ వస్తుంది. జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ ​కాగజ్​నగర్, బల్లార్షా, నాగ్​పూర్, ఇటార్సి, పిపారియా, జబల్ పూర్, కట్నీ జంక్షన్, సాత్నా, మాణిక్​పూర్​జంక్షన్,​ ప్రయాగ్​రాజ్, వారణాసి, చెయోకీ, పండిత్ దీన్​దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, బక్సర్, ఆరా స్టేషన్లలో ఆగుతుంది.