బీజాపూర్ హైవే పనులు స్పీడప్ .. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

బీజాపూర్ హైవే పనులు స్పీడప్ .. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల, వెలుగు: బీజాపూర్ టు హైదరాబాద్ హైవే పనులను స్పీడప్​ చేశామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. బుధవారం చేవెళ్ల మండల పరిధిలో కొనసాగుతున్న పనులను స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్​ కృష్ణయ్యతో పాటు సంబంధిత అధికారులతో సమీక్షించారు. 

సాధ్యమైనంత త్వరగా రోడ్డు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ హైవే పూర్తయితే చేవెళ్ల, వికారాబాద్, తాండూర్, పరిగి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే  చేవెళ్ల పట్టణంలోని శ్రీనివాస కాటన్ ఇండస్ట్రీస్ లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో మార్కెట్​ కమిటీ చైర్మన్​ పెంటయ్య గౌడ్​, పీఏసీఎస్​ చైర్మన్లు గోనె ప్రతాప్​ రెడ్డి, దేవర వెంకట్​ రెడ్డి, సర్పంచుల సంఘం మండల మాజీ అధ్యక్షుడు పడాల ప్రభాకర్​, సీనియర్​ నేత మర్పల్లి కృష్ణారెడ్డి, కాంగ్రెస్​ మున్సిపల్​ అధ్యక్షుడు శ్రీనివాస్​ గౌడ్  పాల్గొన్నారు.