గచ్చిబౌలి, వెలుగు: ఓ పబ్లో నిర్వహించిన మ్యూజిక్ ఈవెంట్కు ఎంజాయ్ చేద్దామని వెళ్లిన అమ్మాయిలను షాక్ తగిలింది. వారి ఫోన్లు చోరీకి గురయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 15న కొండాపూర్లోని క్వేక్ ఎరినా పబ్లో జర్మనీకు చెందిన ప్రముఖ డీజే ప్లేయర్ బెన్ బోహ్మెర్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించాడు. దీనికి వందలాది మంది హాజరై ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదే అదునుగా కొందరూ వ్యక్తులు యువతుల సెల్ఫోన్లను కొట్టేశారు. ఎంజాయ్ చేద్దామని వస్తే ఫోన్లు చోరీ చేయడంతో కంగుతిన్న ఓ యువతి ఈ విషయమై ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు నలుగురు యువతులు తమ సెల్ఫోన్ చోరీకి గురైనట్లు సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పబ్లోని సీసీ ఫుటేజీ చెక్ చేయగా ఆధారాలు లభించలేదు.
