GHMC కౌన్సిల్ కు ఇతర శాఖ అధికారులను పిలవాలి.. బీజేపీ ఫ్లోర్ లీడర్శంకర్యాదవ్

GHMC కౌన్సిల్ కు  ఇతర శాఖ అధికారులను పిలవాలి.. బీజేపీ ఫ్లోర్ లీడర్శంకర్యాదవ్

హైదరాబాద్ సిటీ, వెలుగు:  జీహెచ్ఎంసీ జనరల్ బాడీ  సమావేశానికి అడిషనల్ కలెక్టర్లు,హెచ్ఎండీఏ అధికారులను పిలవాలని  జీహెచ్ఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్, బీజేపీ కార్పొరేటర్లు  డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కమిషనర్ ఆర్వీ కర్ణన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్కాగిజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ...   ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో  ఎటువంటి లాభం లేకుండానే జీహెచ్ఎంసీ ఆస్తులు ఇతర శాఖలకు బదాలాయించడం వల్ల బల్దియాకు  తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. వీటిపై చర్చ జరిగితే జీహెచ్ఎంసీకి వందలకోట్ల ఆదాయం వస్తుందన్నారు.  ఈ సమస్యలపై చర్చించేందుకు ఆ సంబంధిత శాఖ వారిని కౌన్సిల్ సమావేశానికి పిలిపించాలని  శంకర్ యాదవ్ లేఖలో డిమాండ్ చేశారు.