కార్తీక అమావాస్య ( నవంబర్ 20) రోజు చదవాల్సిన మంత్రం.. చేయాల్సిన పరిహారాలు ఇవే..!

కార్తీక అమావాస్య ( నవంబర్ 20) రోజు చదవాల్సిన మంత్రం.. చేయాల్సిన పరిహారాలు ఇవే..!

కార్తీకమాసం ఈ ఏడాది ( 2025)  రేపటితో ( నవంబర్​ 20) తో ముగియనుంది. కార్తీక అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.  ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం..!

 కార్తీక మాసంలో వచ్చే అమావాస్య  రోజు ( 2025 నవంబర్​ 20)  చాలా శక్తివంతమైనదని పండితులు చెబుతున్నారు.  ఆ రోజున  పూర్వికులను స్మరించుకోవడానికి, పూజించడానికి ఎంతో పవిత్రమైన రోజు. కార్తీక అమావాస్య నాడు పితృ దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చని  ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 

కార్తీక అమావాస్య నాడు బ్రహ్మముహూర్తాన్ని శక్తివంతమైనదిగా భావిస్తారు. ఆ రోజు ( నవంబర్​ 20)  దాన ధర్మాలు చేసినా, నది స్నానాలు చేసినా ఎంతో పుణ్యం కలుగుతుంది. ముఖ్యంతా పితృ దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు కార్తీక అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించచాలని పండితులు చెబుతున్నారు. 

చేయాల్సిన పరిహారాలు ఇవే..!

 

 

  • కార్తీక అమావాస్య నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పూజ చేయాలి.
  • స్నానం చేసేటప్పుడు  గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ |
  • నర్మదే సింధు కావేరి జలేయస్మిన్ సన్నిధిం కురు || అనే మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి.
  • అవకాశం ఉంటే నది స్నానం చేయడం మంచిది. దగ్గరలో నది లేకపోతే ఇంటి దగ్గర బావి దగ్గర గాని.. కుళాయి వద్దగాని స్నానం చేసినా అలాంటి ఫలితమే కలుగుతుంది. 
  •  తరువాత సూర్యభగవానుకి నమస్కరించాలి.
  • రాగి పాత్రలో నీళ్లు, కొద్దిగా పాలు, సింధూరం, ఎర్రటి పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.
  • శివ–కేశవుల్ని స్మరిస్తూ కార్తీక  అమావాస్యనాడు పూజలు చేయాలి.
  •  స్వామివారికి పువ్వులు, పసుపు, చందనం, అక్షింతలు తో పాటు నైవేద్యాన్ని కూడా సమర్పించాలి.
  •  కార్తీకమాసంలో 365 వత్తులు వెలిగించని వారు ఈ రోజున ( 2025 నవంబర్​20)  వెలిగించినా అంతటి ఫలితం వస్తుంది.రుద్రాభిషేకం చేయాలి

కార్తీక అమావాస్య నాడు జపించాల్సిన మంత్రం ఇదే ..

  • పితృదేవతలకు నువ్వులు నీళ్లు.. తర్పణాలను వదులుతూ  ఓం పితృదేవాయ నమం: అనే మంత్రాన్ని మూడుసార్లు జపించాలి.  బ్రాహ్మణులకు వస్త్రదానం చేయలి. ఇలా చేయడం వలన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది.   
  • కార్తీక అమావాస్య ( 2025 నవంబర్​ 2) సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.  పిండి దీపాన్ని వెలిగించండం వలన  శాంతి, సంతోషం ఉంటాయి. పితృదేవతల అనుగ్రహం కూడా ఉంటుంది.
  • సాయంత్రం ప్రదోష సమయంలో రావిచెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టాలి.  ఆకాశదీపం కింద నుండి వెళ్లి శివ పరమాత్ముడిని దర్శనం చేసుకోవాలి.
  • దగ్గరలో ఉన్న శివాలయాలు, విష్ణు దేవాలయాలను దర్శించుకుని, దేవుడికి అభిషేకం లేదా ప్రత్యేక పూజలు చేయాలి.  ఇలా చేయడం వలన  ఈ మాసానికి సంబంధించిన విశేష ఫలాన్ని పొందవచ్చుని పండితులు చెబుతున్నారు. .
  • క్షమాపణ కోరడం: ముందుగా, మాసం మొత్తం దీపారాధన చేయలేకపోయినందుకు శివుడిని ..విష్ణువును మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాలి.
  • దీపారాధన: వీలైనన్ని ఎక్కువ దీపాలను (నూనె లేదా నెయ్యితో) వెలిగించాలి. ఇంటి ముందు, పూజా మందిరంలో, తులసి కోట వద్ద, ఆకాశ దీపం (వీలైతే) కూడా వెలిగించి, మాసం మొత్తం దీపం వెలిగించిన ఫలాన్ని పొందడానికి సంకల్పం చెప్పుకోవాలి.
  • పేదవారికి లేదా ఆలయాలకు శక్తి మేరకు దానధర్మాలు చేయాలి. దీపం వెలిగించడానికి నూనె, వత్తులు దానం చేయడం శుభప్రదం.  

 కార్తీక అమావాస్య కేవలం మాసం ముగింపు మాత్రమే కాదు. ఈ  మాసంలో చేసిన సత్కర్మల ఫలాన్ని పరిపూర్ణం చేసుకునే ఒక పవిత్ర అవకాశం. ఆ రోజున ( నవంబర్​ 20)  భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించినా, చిన్న దానం చేసినా గొప్ప పుణ్యం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.