ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్రంలో యువత మద్యం, డ్రగ్స్ బారినపడటం ఆందోళనకరమని, ప్రభుత్వమే వీటిని నియంత్రించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ సోషల్ మీడియా ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు ‘అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ‘నో డ్రగ్స్స్టేట్’ అంశంపై మాట్లాడారు. సమావేశానికి చీఫ్ గెస్ట్గా హాజరైన తెలంగాణ జన సమితి ప్రెసిడెంట్ కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రం లిక్కర్ ఆదాయంతోనే నడుస్తోందని, టీఆర్ఎస్ పాలనలో లిక్కర్ అమ్మకాలు 300% పెరిగాయన్నారు. మద్యం కారణంగా నిరుపేద ఆర్థికంగా చితికిపోతున్నాడని, పేదోళ్లు బతుకుదెరువు కోసం తయారు చేసే మద్యానికి పర్మిషన్ ఇవ్వకుండా కేవలం పెద్ద కంపెనీలకు అనుమతి ఇస్తున్నారన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, దీని వెనుక విదేశీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రాష్ట్రంతో పాటు దేశంలోనూ విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ కేశవులు మాట్లాడుతూ.. కొన్ని దేశాలు భారత్పై మత్తు పదార్థాల రూపంలో దాడి చేస్తున్నాయని, 15 ఏండ్ల నుంచి 20 ఏండ్లలోపు యువత డ్రగ్స్కు బానిస అవుతున్నారన్నారు. సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని అన్నారు. ఆప్ నేత ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. మద్యం, డ్రగ్స్ వల్లే నేరాలు పెరుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం ప్రభుత్వమే అన్నారు. అనంతరం నో డ్రగ్స్ స్టేట్ బ్రోచర్ను రిలీజ్ చేశారు.
రాష్ట్రం లిక్కర్ ఆదాయంతోనే నడుస్తోంది
- హైదరాబాద్
- June 27, 2022
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు